Highlights
రూ. 1.69 కోట్లతో మెర్సిడెస్ బెంజ్ ఎస్క్లాస్ 450

తెలంగాణ ప్రభుత్వం రూ. 1 .69 కోట్లు వెచ్చించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు కొత్త బెంజి కారు ను సమకూర్చింది. రాజభవన్ అధికారుల విజ్ఞప్తి మేరకు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్క్లాస్ 450కారును ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) అదనపు కార్యదర్శి ఏ వీ సింగ్ స్వయంగా రాజభవన్ లో గవర్నర్ కు కొత్త కారును స్వాధీనం చేశారు. ప్రస్తుతం గవర్నర్ బెంజ్ కారే వాడుతున్నారు. ఐదేళ్ల కిందట కొనుగోరాజభవన్ లో గవర్నర్ కులు చేసిన ఆ కారుకు తరచూ రిపేర్లు వస్తుండటంతో కొత్త కారును కొనుగోలు చేయాలని రాజభవన్ అధికారులు ప్రభుతానికి లేఖరాయడంతో ఈ కారు వచ్చింది.