Highlights
- వరుసగా విగ్రహాల ధ్వంసం
- ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ప్రకాష్ రాజ్
- విగ్రహాల రాజకీయాన్ని ఆపండి.

బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విగ్రహాల ధ్వంసకాండను ఆక్షేపిస్తూ.. అసలు మీ ఎజెండా ఏమిటని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దేశంవ్యాప్తంగా జరుగుతున్నఈ విగ్రహాల ధ్వంసంపై అయన తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తొలుత లెనిన్ విగ్రహాన్ని, ఆపై పెరియార్ విగ్రహాన్ని, తరువాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వసం చేశారని గుర్తు చేశారు. ఇంత విధ్యంసాన్ని సృష్టించి భావిభారత పౌరులకు ఏం చెప్పదలచుకున్నారని నిలదీశారు.హింసామార్గంలో వెళితే మరింత హింసను చూడాల్సి వుంటుందని, మీ ఎన్నికల మ్యానిఫెస్టో గూండాయిజాన్ని పెంచి పోషించడమా? లేక అభివృద్ధా? అంటూ నిప్పులు చెరిగారు. దయచేసి ఇప్పటికైనా ఈ విగ్రహాల రాజకీయాన్ని ఆపాలని చేతులెత్తి కోరుతున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు.
#Correction West Bengal: Bharatiya Jana Sangh founder Syama Prasad Mukherjee's bust was vandalized in Kolkata's Kalighat pic.twitter.com/BENhueIgiK
— ANI (@ANI) March 7, 2018