YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

8 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

Highlights

  • జేసీలు కలెక్టరీర్లగా బదిలీ
8 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్‌లుగా పదోన్నతులు పొందిన అధికారులను పలు జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది. కాగా సీఎంవో 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్‌సుల్తానియా, 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్ రాజ్‌లను తీసుకున్నారు. కాగా సీఎంవో కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చిన సందీప్‌కుమార్ సుల్తానియాకు పశుసంవర్థకశాఖ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్‌రాజ్‌ను సీఎంవో అదనపు కార్యదర్శిగా నియమించారు. పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చింది. 

బదిలీ అయిన వారి జాబితా..
నిర్మల్ జేసీ సీహెచ్ శివలింగయ్య -  మహబూబాబాద్ కలెక్టర్
ఖమ్మం జేసీ టీ వినయ్‌కుమార్‌రెడ్డి -  జనగామ కలెక్టర్
జయశంకర్ భూపాల్‌పల్లి జేసీ డీ అమోయ్‌కుమార్ -అక్కడే కలెక్టర్ గా 
ఎం హరిత - వరంగల్ రూరల్ జేసీనే  కలెక్టర్
సందీప్‌కుమార్ సుల్తానియా - ఎహెచ్‌డీడీ సీఎంవో
వీ వెంకటేశ్వర్లు - సంగారెడ్డి జేసీనే  సంగారెడ్డి కలెక్టర్
కే మానిక్‌రాజ్ - సంగారెడ్డి కలెక్టర్ సీఎంవో
కే ధర్మారెడ్డి - మేడ్చల్ జేసీనే  కలెక్టర్

Related Posts