YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పాకిస్తాన్ లో 86 వేలకు చేరిన బంగారం

పాకిస్తాన్ లో 86 వేలకు చేరిన బంగారం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బంగారం ధర రూ.38,000కు చేరితేనే మనం వామ్మో అనేస్తున్నాం. అలాటింది పసిడి ధర ఏకంగా రూ.86,000కు పైన ఉంటే.. ఇంకేమైనా ఉందా? బంగారం కొనడం గురించి మర్చిపోతామేమో! కానీ ఇప్పుడు బంగారం ధర రూ.86,250కు పెరిగింది. అయితే మనదేశంలో కాదు పొరుగులు ఉన్న పాకిస్తాన్‌లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వంటి నిర్ణయాలను వ్యతిరేకించిన పాకిస్తాన్‌లో ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా తయారైంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఇప్పుడు మరింత అద్వాన్నంగా మారింది. పాకిస్తాన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ధరలను నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారు. భారత్ మార్కెట్లోని బంగారం ధరతో పోలిస్తే పాకిస్తాన్‌లో బంగారం ధర దాదాపు రెట్టింపుగా ఉంది. అక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.86,250గా ఉంది. పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీ స్థాయికే చేరుకున్నాయి. అక్కడి ప్రభుత్వం రుణాలకు వడ్డీ కూడా కట్టాలేని పరిస్థితుల్లో ఉంది. భారత్‌లో వాణిజ్య బంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,750 పెరిగింది. దీంతో ధర రూ.86,250కు చేరింది. పాకిస్తాన్ కరెన్సీ ఇటీవల కాలంలో గణనీయంగా పడిపోవడం కారణంగానే అక్కడి బులియన్ మార్కె్ట్‌లో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరల పెరుగుదల భారత్‌లో కన్నా పాకిస్తాన్‌లో ఎక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్తాన్ వెంటనే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చుకుంటే కరెన్సీ బలపడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కరెన్సీ స్థిరపడితే అప్పుడు వాణిజ్య పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. ఇకపోతే పాకిస్తాన్ ప్రధాని అక్కడి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Related Posts