YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రెండు మారుతి ప్లాంట్లు మూసివేత

రెండు మారుతి ప్లాంట్లు మూసివేత

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మారుతీ సుజికీ సంస్థ త‌న వాహ‌న ఉత్ప‌త్తి కేంద్రాల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించింది. ఆర్థిక మాంద్యం నేప‌థ్యంలో మారుతీ వాహ‌నాల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. దీంతో గురుగ్రామ్‌, మ‌నేస‌ర్ ప్లాంట్ల‌లో రెండు రోజుల పాటు ఉత్ప‌త్తిని నిలిపివేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌(బీఎస్ఈ)కి ఆ సంస్థ రెగ్యులేట‌రీ ఫైలింగ్ కూడా చేసింది. ఈనెల 7వ‌, 9వ తేదీల్లో ప్లాంట్‌ను మూసివేయ‌నున్న‌ట్లు చెప్పింది. ఆ రెండు రోజులు ఉత్ప‌త్తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఆర్థిక మాంద్యం కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఆటో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లు సంస్థ‌లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాహ‌నాల అమ్మ‌కాలు ప‌డిపోవ‌డంతో.. ఆ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్న వేలాది మంది కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు.

Related Posts