YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

దిగొచ్చిన పసిడి ధరలు

దిగొచ్చిన పసిడి ధరలు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.40,920కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గుదలతో రూ.37,530కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పైకి పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,220 పెరుగుదలతో రూ.50,870కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.39,450కు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గుదలతో రూ.38,300కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగింది. రూ.1,220 పెరుగుదలతో రూ.50,870కు చేరింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1,524.15 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.57 శాతం తగ్గుదలతో 18.69 డాలర్లకు దిగొచ్చింది.
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts