YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నేనింతే... సైరా బాధితులతో రాంచరణ్

నేనింతే... సైరా బాధితులతో రాంచరణ్

నేనింతే... సైరా బాధితులతో రాంచరణ్
హైద్రాబాద్, సెప్టెంబర్ 19 
భార‌త‌ స్యాతంత్య్ర తొలి పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న జీవిత చరిత్రను ‘సైరా న‌ర‌సింహారెడ్డి’గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై తొలి నుండి వివాదం నడుస్తోంది. కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ లాంఛ్‌లో భాగంగా.. ఈ ఇష్యూపై క్లారిటీ ఇస్తూ తన నిర్ణయాన్ని తేల్చిచెప్పేశారు రామ్ చరణ్.‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ వంశానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయంపై స్పందిస్తూ.. ‘నేను గతంలో ఉయ్యాల‌వాడ ఫ్యామిలీస్‌ని కలిశాను. వాళ్లతో మాట్లాడాను. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు.. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 100 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా చేసుకోవచ్చిని ఎవరైనా తీయొచ్చని. ఇంకా చెప్పాలంటే ఇటీవల మంగళ్ పాండే అనే గ్రేట్ లీడర్‌పై సినిమా తీసేటప్పుడు కూడా ఇలాంటి వివాదామే నడిచింది. ఆ సందర్భంలో 100 సంవత్సరాలు కాదు.. 65 సంవత్సరాలకే ఇలాంటి వ్యక్తులు జీవితాలను సినిమాగా తీయొచ్చని చెప్పారు.‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడం అనేది నాకు అర్ధం కావడం లేదు. ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారు. నేను రేపటి రోజున ఏదైనా చేయాలని అనుకుంటే.. ఆ ఊరికోసం చేస్తాను.. ఆ జనం కోసం చేస్తాను తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం నేను చేయను’ అంటూ కుండబద్దలు కొట్టేశారు రామ్ చరణ్.ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయడానికి రామ్ చరణ్ నిర్ణయించుకున్నప్పుడు.. జూన్ 30న ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం చేస్తామ‌ని కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ వారు ఉయ్యాలవాడ వంశస్తులకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. తరువాత ఈ కథపై వారికి ఎలాంటి హక్కులు లేవనడంతో ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ ఆఫీస్ ముందు ధ‌ర్నా చేశారు. మా ర‌క్తం, మా బంధంతో కొణిదెల ప్రొడక్షన్స్ కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేస్తుందని రామ్‌చ‌ర‌ణ్ ఆఫీస్ ముందు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌ చేశారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. అప్పట్లో తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Related Posts