YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొండెక్కిన పసిడి ధర

కొండెక్కిన పసిడి ధర

కొండెక్కిన పసిడి ధర
ముంబై, అక్టోబరు 4,
పసిడి ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.910 పెరుగుదలతో రూ.39,580కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.910 పెరుగుదలతో రూ.36,360కు ఎగసింది. బంగారం ధర భారీగా పెరిగితే.. వెండి ధర మాత్రం పతనమైంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పది గ్రాములకు రూ.950 మేర పరుగులు పెట్టింది. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,150కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.38,950కు ఎగసింది. పసిడి ధర పరిగెడితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు పతనమైంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1,513.65 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 17.66 డాలర్లకు తగ్గింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

Related Posts