షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం….తల్లీ కొడుకులు సజీవదహనం
చిత్తూరు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ కూనపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికంగా వుంటున్న శేఖర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి తల్లీ కొడుకులు సజీవదహనం అయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా యుపిఎస్ బ్యాటరీ పేలుడు సంభవించి అగ్ని మంటలు వ్యాపించాయి. దాంతో విద్యుత్ షార్ట్
సర్క్యూట్ అయి తల్లి శంకరమ్మ ( 75) కొడుకు శేఖర్ (50) ఇద్దరు సజీవ దహనం అయిపోమారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.