YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

సైనేడ్ కిల్లర్ పై సిట్ దర్యాప్తు

సైనేడ్ కిల్లర్ పై సిట్ దర్యాప్తు

సైనేడ్ కిల్లర్ పై సిట్ దర్యాప్తు
తిరువనంతపరం
కేరళ వరుస హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోజికోడ్‌‌కి చెందిన జోలీ.. 14 ఏళ్లలో తన మొదటి భర్త సహా ఆరుగుర్ని హతమార్చింది. ఆస్తి కోసమే 2002-2014 మధ్య జోలీ సైనేడ్‌తో వీరందర్నీ హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి ఆసక్తిక విషయాలు తెలిశాయి. జోలీకి ఆడ పిల్లలంటే నచ్చదని కోజికోడ్ రూరల్ ఎస్పీ కేజీ సిమన్  తెలిపారు. మొదటి భర్త రాయ్ థాస్‌ను సైనెడ్ ఇచ్చి చంపిన జోలీ.. రెండేళ్ల అతడి సోదరి కుమార్తెను కూడా హతమార్చిందని చెప్పారు. జోలీ స్టేట్‌మెంట్‌ను సిట్ బృందం రికార్డ్ చేసిందని సమాచారం.కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన జోలీ.. ఇంజినీరింగ్ చదివినట్టు పోలీసులకు అబద్ధం చెప్పింది. ఎన్ఐ‌టీలో బోధించినట్టు కూడా చెప్పింది. కానీ ఆ విద్యాసంస్థ ఆమె చెప్పిందని నిజం కాదని పేర్కొంది. జోలీ అబద్దాలు చెబుతోందని, ఆమె సీరియల్ కిల్లర్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరో ఇద్దరి హత్యకు కూడా ఆమె ప్లాన్ వేసిందని చెప్పారు. ఆభరణాల షాపులో పని చేసే ప్రదీప్ అనే వ్యక్తి సాయంతో ఆమె సైనేడ్ తెప్పించేదని పోలీసులు తెలిపారు.తన కుటుంబ సభ్యుల హత్య కేసును విచారిస్తోన్న డిప్యూటీ తహసీల్దార్ కుమార్తె జయశ్రీని చంపడానికి కూడా జోలీ ప్రయత్నించిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. క్లిష్టమైన ఈ కేసులో హత్యకు గురైన వారి మృతదేహాలను విశ్లేషించి సాక్ష్యాలను సేకరించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న లేబరీటరీల సాయాన్ని పోలీసులు కోరుతున్నారు. అవసరమైతే విదేశీ లేబోరేటరీల సాయాన్ని కూడా కోరాలని భావిస్తున్నారు.కేరళలోని కూడతాయ్‌కి చెందిన అన్నమ్మ థామస్, టామ్ థామస్ దంపతులకు రాయ్ థామస్, మోజో అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాయ్ థామస్‌కి 14 ఏళ్ల క్రితం జోలీతో వివాహమైంది. కానీ రాయ్ థామస్ పెద్దనాన్న కొడుకు షాజూతో జోలీకి వివాహేతర సంబంధం ఉంది. తన భర్త కుటుంబానికి చెందిన ఆస్తిని దక్కించుకోవాలని, షాజూను పెళ్లాడాలని ఆమె ప్లాన్ వేసింది.ఇందులో భాగంగా 2002లో తన అత్త అన్నమ్మ థామస్‌ను, 2008లో మామ టామ్ థామస్‌ను హతమార్చింది. 2011లో భర్త రాయ్ థామస్‌ను చంపేసింది. రాయ్ థామస్ మరణం పట్ల అతడి మేనమామ మ్యాథ్యూ అనుమానాలు వ్యక్తం చేయగా.. పోస్టుమార్టంలో అతడి శరీరంలో సైనేడ్ ఆనవాళ్లు కనిపించాయి. 2014లో మ్యాథ్యూ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. తర్వాత షాజూ భార్య సిలీ, కుమార్తె అల్ఫోన్సా కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆస్తి కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో అమెరికాలో ఉంటున్న రాయ్ సోదరుడు రోజీకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అనుమనాస్పద మరణాలపై పోలీసుల విచారణ సాగుతుండగానే.. షాజూను జోలీ పెళ్లాడింది. దీంతో పోలీసులకు జోలీపై అనుమానం వచ్చి ఆరా తీయగా.. ఈ హత్యలను తానే చేశానని అంగీకరించింది

Related Posts