YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పిన్నీపైనే అత్యాచారం 

పిన్నీపైనే అత్యాచారం 

పిన్నీపైనే అత్యాచారం 
కాకినాడ,
కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ యువకుడు వావి వరుసలు మరిచి పిన్నిపైనే అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం భీమవరంలో ఆదివారం జరిగింది. గ్రామంలో భర్త, పిల్లలతో కలిసి ఉంటున్న మహిళ ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని ఆమె బావ కొడుకైన శివచైతన్య అనే యువకుడు గ్రహించాడు.
ఆమె ఇంటికి చేరుకుని మాటలు కలిపాడు. కొడుకు వరుసైనోడే కదా అని చనువుగా మాట్లాడింది. కొద్దిసేపటికి అతడు డబుల్ మీనింగ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె శరీర అవయవాల గురించి అసభ్యంగా మాట్లాడాడు. శివ ప్రవర్తనలో మార్పులు గమనించిన మహిళ తనకు పని ఉందని, మళ్లీ రావాలని హెచ్చరించి తలుపు వేసుకోబోయింది. దీంతో రెచ్చిపోయిన శివ పిన్నిని గదిలోకి తోసి తలుపులు వేసేశాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించి అఘాయిత్యం చేయబోయాడు.తల్లి లాంటి తనను కోరిక తీర్చమని అడగటం దారుణమని, వదిలేయాలని ఆమె వేడుకున్నా శివ కనికరించలేదు. దీంతో బాధితురాలు ధైర్యం తెచ్చుకుని ఆ కామాంధుడిని పక్కకు తోసేసి వెంటనే బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పింది. దీంతో వారు శివను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శివచైతన్య గతంలోనూ గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేయబోయాడని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేయడంతో ఇప్పుడు మరింత రెచ్చిపోయిన ఏకంగా పిన్నిపైనే అఘయాత్యానికి పాల్పడ్డాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి గ్రామంలో ఉంటే మహిళలకు రక్షణ ఉండదని అభిప్రాయపడుతున్నారు.

Related Posts