YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బస్సు లోయలో పడి ఐదుగురు మృతి

బస్సు లోయలో పడి ఐదుగురు మృతి

బస్సు లోయలో పడి ఐదుగురు మృతి
కాకినాడ 
తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర విషాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది.  ఘాట్రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  మారేడుమిల్లి వద్ద అడవుల్లో ఈ సంఘటన జరిగింది. అడవి ప్రాంతం కావడంతో ఫోన్ కమ్యూనికేషన్ అందుబాటులో లేదు. విషయం తెలియగానే అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ప్రమాదనికి గురైన  ప్రైవేటు ట్రావెల్సు బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది.   భద్రాచలం నుంచి రాజమండ్రికి ఈ బస్సు వస్తోందని తెలుస్తోంది.

Related Posts