YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

పంజాగుట్టలో అమానుష ఘటన

పంజాగుట్టలో అమానుష ఘటన

పంజాగుట్టలో అమానుష ఘటన
హైదరాబాద్ 
పంజాగుట్ట ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఓ చెత్తకుప్పలో పడేశారు. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని చెత్తకుప్పలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి బిడ్డను వదిలి వెళ్లారు. చంటిపాప ఏడుపు విని స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేత కుప్పలో ఉన్న పాపను చేరదీశారు. అనంతరం వైద్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ పాపకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనేది సీసీ టీవీ ఫుటేజీలో సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే పసికందును వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.

Related Posts