చెలిమిళ్ల లో రైతు ఆత్మహత్య
పాములపాడు
పొలం దున్ని పంటలు వేసి పంటలు చేతికి రాక,పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక, కుటుంబ భారం మోయలేక ,జీవనాన్ని కొనసాగించలేక సమాజానికి అన్నం పెట్టే రైతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు .* ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదు? *వివరాలలోకి వెళితే కర్నూలు జిల్లా పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన పుల్లంరావు కుమారుడు హనుమంతరావు(40) అనే రైతు 17 వతేది పొలం దగ్గరికి వెళ్లి దిగులతో భయపడి ప్రతి సంవత్సరం సేద్యం చేసినా అప్పులు తెరటం లేదని పొలం దగ్గర ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో ని రైతులు వారి కుటుంబాన్ని తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.రైతులకు నిత్యం వర్షా భావం తో ,కరువులతో తీరా పంటలు చేతికొచ్చాక అతివృష్టి అనావృష్టి తో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారని హనుమంతురావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు అంటున్నారు