YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నెక్కొండ మండలంలో దారుణం

నెక్కొండ మండలంలో దారుణం

నెక్కొండ మండలంలో దారుణం
వరంగల్, 
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మడిపల్లి శివారు గేట్ తండాలో వృద్ధ దంపతులు ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. ఆ దంపతుల కొడుకు వారిని సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తండాకు చెందిన ఓ ఇంట్లో నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. తండావాసులు పరుగెత్తికెళ్లి చూడగా.. భూక్య ధస్రు (68), బాజు(65) అనే దంపతులు మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనమయ్యారు.తండావాసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. నెక్కొండ ఎస్‌ఐ నవీన్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వృద్ధ దంపతుల ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. దంపతులు మంటల్లో కాలిపోతుండగా చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనతో తండాలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts