YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

యువతిపై మైనర్ల అత్యాచారం

యువతిపై మైనర్ల అత్యాచారం

యువతిపై మైనర్ల అత్యాచారం
విశాఖలో దారుణం
విశాఖపట్టణం 
విశాఖపట్టణంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కైలాసగిరిపై దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ యువతి (22), బాలుడు (18) కైలాసగిరికి వచ్చారు. కొండపై కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ఇద్దరూ ఓ ప్రదేశంలో కూర్చున్నారు. అనంతరం బాలుడు ఓ కూల్డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. యువతి మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న బాలుడి స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బాలురను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో పడి వున్న బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు. మరో నిందితుడి పేరు గురివిల్లి రమణ అని పోలీసులు తెలిపారు. నిందితులంతా జోడుగుళ్లపాలేనికి చెందిన వారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts