YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

అసోం లో ఎన్‌కౌంటర్‌ .....ఇద్దరు మావోయిస్టుల మృతి 

అసోం లో ఎన్‌కౌంటర్‌ .....ఇద్దరు మావోయిస్టుల మృతి 

అసోం లో ఎన్‌కౌంటర్‌ .....ఇద్దరు మావోయిస్టుల మృతి 
గువహతి నవంబర్ 1
అసోం రాష్ట్రంలోని కోక్రాఝార్ జిల్లా సరాయిబిల్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. సరాయిబిల్ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు తుపాకులతో ద్విచక్రవాహనంపై వెళుతుండగా పోలీసులు చూసి ఆగమని హెచ్చరించారు. మావోయిస్టులు బైక్ ఆపకుండా పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో అసోం పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య పదినిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని కోక్రాఝార్ జిల్లా ెస్పీ రాజన్ సింగ్ చెప్పారు. మరణించిన మావోయిస్టుల వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ , ఓ మాగజైన్, ఐదు 7.65 ఎంఎం లైవ్ బుల్లెట్లు, మోటారుసైకిలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.

Related Posts