YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 150 పరుగులకే బంగ్లా ఔట్

 ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 150 పరుగులకే బంగ్లా ఔట్

 ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్
150 పరుగులకే బంగ్లా ఔట్
ఇండోర్, నవంబర్ 14,
భారత్‌తో ఇండోర్ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ (3/27), ఇషాంత్ శర్మ (2/20), అశ్విన్ (2/43), ఉమేశ్ యాదవ్ (2/47) ముప్పేట దాడి చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (43: 105 బంతుల్లో 4x4, 1x6) కాసేపు భారత బౌలర్లకి ఎదురు నిలిచాడు. తైజుల్ ఇస్లామ్‌.. జడేజా విసిరిన త్రో కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు, రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్.. ఆఖరి సెషన్ ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయి 58.3 ఓవర్లలోనే ఆలౌటవడం విశేషం.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తొలి సెషన్‌లోనే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ని ఒత్తిడిలోకి నెట్టేశారు. ఓపెనర్లు సదామన్ ఇస్లామ్ (6), ఇమ్రూల్ ఖయ్యూస్ (6) సింగిల్ డిజిట్ స్కోరుతోనే సరిపెట్టగా.. మహ్మద్ మిథున్ (13) తేలిపోయాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో స్పిన్నర్ అశ్విన్ మాయ మొదలైంది. కెప్టెన్ మొమినుల్ (37: 80 బంతుల్లో 6x4) వికెట్‌తో ఆ జట్టు పతనాన్ని కొనసాగించిన అశ్విన్.. మహ్మదుల్లా (10)నీ బోల్తా కొట్టించేశాడు. ఇక ఆఖర్లో మళ్లీ షమీ, ఇషాంత్ శర్మ చెరొక వికెట్ పడగొట్టగా.. హుస్సేన్‌(2)ని ఆఖర్లో బౌల్డ్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌కి ఉమేశ్ యాదవ్ తెరదించాడు.ఇప్పటి వరకూ 6 టెస్టుల్లో తలపడిన బంగ్లాదేశ్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఆరింట్లో ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి.. ఒక్క టెస్టుని మాత్రం డ్రాగా ముగించింది. తాజా టెస్టులోనూ తొలిరోజు రెండో సెషన్‌లో ఆలౌటవడం ద్వారా.. భారత్ జోరు ముందు తేలిపోయింది.

Related Posts