
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి...
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన చిట్వేలా రాజేందర్ (52) ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు.ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్థాపానికి, మనోవేదనకు గురయ్యాడు.ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గుండెపోటు రాగా కుటుంబీకులు నిజామాబాద్ పట్టణంలోని బాంబే నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి
తరలించారు.చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందాడు.