YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఏపీలో 24 నుంచి ఎమ్మెల్యేలకు ఆటల  పోటీలు 

Highlights

  • 27న సాంస్కృతిక కార్యక్రమాలు
ఏపీలో 24 నుంచి ఎమ్మెల్యేలకు ఆటల  పోటీలు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఈ  నెల 24 నుంచి 27 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో  క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ 24 నుంచి 26 వరకు ఆటల పోటీలను, 27న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మొత్తం 10 రకాల ఆటల్లో పోటీలు నిర్వహిస్తారు. సభాపతి కోడెల సువ ప్రసాద రావు అధ్యక్షతన తన ఛాంబర్ లో జరిగిన సమావేశంలో మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, అయ్యన్న, కొల్లు రవీంద్ర, చీఫ్‌విప్‌ రఘునాథరెడ్డి, విప్‌ కూన రవికుమార్‌, ఇన్‌ చార్జ్‌ సెక్రటరీ విజయరాజు పాల్గొన్నారు.

Related Posts