YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్తు లోకోలతో రైళ్లకు పచ్చ జెండా

Highlights

  • విద్యుత్తు లోకోలతో రైళ్లకు పచ్చ జెండా
  • ఇక గుంటూరు - బెంగళూరుకు
  • తొలి ప్రయత్నం బందరు నుంచి యశ్వంత్పూర్  శ్రీకారం
  • త్వరలో సూపర్ ఫాస్టు రైళ్ళు
విద్యుత్తు లోకోలతో రైళ్లకు పచ్చ జెండా

గుంటూరు నుంచి బెంగళూరు వరకు విద్యుత్తు లోకోలతో రైళ్లను నడిపేందుకు మార్గం సుగమమైంది. తొలిసారి మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలును బుధవారం విద్యుత్తు లోకోతో నడిపారు. ఈ రైలును విజయవాడ వరకు డీజిల్తో... అక్కడి నుంచి విద్యుత్తు లోకోతో ప్రారంభించారు. త్వరలో గుంటూరు మీదుగా బెంగళూరుకు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా రానున్నాయి. సరకుల రైళ్ల వేగం పెరగడంతో పాటు రాకపోకలు అధికమవుతాయి. గుంటూరు- గుంతకల్ మార్గంలో విద్యుదీకరణ పూర్తయినందున బుధవారం నుంచి విద్యుత్తు లోకోలతో రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇక నుంచి విద్యుత్తు లోకోలతో మచిలీపట్నం-యశ్వంత్పూర్-మచిలీపట్నం, హౌరా-సత్యసాయిప్రశాంత నిలయం-హౌరా, పూరి-యశ్వంత్పూర్-పూరి ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు.

Related Posts