YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య, లోకేష్ పై రోజా  సెటైర్లు

బాలయ్య, లోకేష్ పై రోజా  సెటైర్లు

బాలయ్య, లోకేష్ పై రోజా  సెటైర్లు
విజయవాడ, డిసెంబర్ 11 
మూడు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ-వేడిగా జరుగుతున్నాయి. సభలో మాత్రమే కాదు.. బయట కూడా ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయి. బుధవారం అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో ముచ్చటించారు. హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని.. ఆయన కళాకారులను అవమానిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారట. అలాగే ముఖ్యమంత్రి జగన్.. తనతో పాటూ పలువురు కళాకారుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా చెప్పారట.ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్‌పైనా రోజా సెటైర్లు పేల్చారు.. ఉదయం జరిగిన ప్రెస్‌మీట్‌కు కౌంటరిచ్చారు. లోకేష్‌తో టీడీపీ నేతలు హడావిడి పడి ఉదయాన్నే ప్రెస్‌మీట్ పెట్టించారని వ్యాఖ్యానించారు. తనను చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయని లోకేష్ అన్నారని.. తనకు కూడా లోకేష్‌ను చూస్తే కాళ్లు వణుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళగిరి అని పలకడానికి ట్యూషన్ పెట్టించుకున్నారని సెటైర్లు వేశారు. శ్రీకాకుళం ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా, సీమ ప్రాజెక్టుల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు.రోజా అసెంబ్లీలోనూ లోకేష్‌, బాలయ్యలను టార్గెట్ చేశారు. మహిళా భద్రతకు సంబంధించి జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే.. ఇద్దరిపై సెటైర్లు పేల్చారు. లోకేష్ ఫోటోలు, బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బయటపడతాయనే అసెంబ్లీలో మహిళ భద్రతపై జరుగుతున్న చర్చను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అలాగే సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్‌కు జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Posts