YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు 

టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు 

టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు 
తిరుమల డిసెంబర్ 28
జనవరి 6,7  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి వీలైనంత మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు  చేస్తున్నామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం పాలకమండలి సమావేశం తరువాత అయన మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు అయన తెలిపారు.  2019-20 సంవత్సరానికి సంబంధించి 3263 కోట్లతో టిటిడి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశించారు. 1231 కోట్ల హుండీ, 330 కోట్ల రూపాయలను ప్రసాదాల ద్వారా రాబడిని యోచిస్తున్నట్లు అయన తెలిపరు. రుపతిలోని పద్మావతి, శ్రీనివాస కల్యాణ మండపాలను ఏ.సి గా తీర్చీదిద్దాలని  నిర్ణయించారు. టిటిడి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో నూతన అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తున్నాం. ముంబైలో నూతన శ్రీనివాస ఆలయం నిర్మాణం,  గుజరాత్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం తెలిపారు.  జమ్ము కాశ్మీర్, వారణాసి లో శ్రీవారి దేవాలయం నిర్మించేడానికి బోర్డు నిర్ణయించింది. తిరుమల వరహస్వామి ఆలయ బంగారు తాపడం కు 14 కోట్లు కేటాయించారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో మరమ్మతులకు ఎక్స్పెర్ట్ కమిటీ నిర్ణయం మేరకు సిసి రోడ్ల నిర్మాణం, టిటిడి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ప్రఖ్యాత ఐ.టి కంపెనీల సహకారంతో ప్రత్యేక అధికారి నియామకానికి ఆమోదం తెలిపింది. ఇటీవల ఒక ప్రధాన దిన పత్రిక లో వచ్చిన యేసయ్య కథనంతో టిటిడి పరువును నష్టం కలిగించేలా ఉండడంతో 100 కోట్ల కు పరువు నష్టం దావా వేస్తున్నామని అయన అన్నారు. టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులకు తిరిగి బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయించారు. టిటిడి ఉద్యోగులు నియామకానికి కమిటీ ఏర్పాటు,  బర్డ్ డైరెక్టర్ గా చెన్నై కి చెందిన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి  నియామకానికి కుడా టీటీడీ అంగీకారం తెలిపినట్లు అయన వెల్లడించారు.

Related Posts