YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రాయపాటిపై ఈడీ కేసు నమోదు

రాయపాటిపై ఈడీ కేసు నమోదు

రాయపాటిపై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్‌ జనవరి 3
: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదయ్యింది. నిధుల మళ్లింపు విషయంలో రాయపాటిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌టాయ్‌ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.16 కోట్లు సింగపూర్‌, మలేషియాకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సింగపూర్‌, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి.కాగాసీబీఐ వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని.. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లిపోయారని చెప్పిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కంపెనీ వ్యవహారాలన్నీ సీఈవో చూసుకుంటున్నారని రాయపాటి స్పష్టం చేశారు.

Related Posts