YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

విద్యార్ధిని ఆత్మహత్య...బంధువుల అందోళన

విద్యార్ధిని ఆత్మహత్య...బంధువుల అందోళన

విద్యార్ధిని ఆత్మహత్య...బంధువుల అందోళన
ఏలూరు జనవరి 3
పశ్చిమ గోదావరి జిల్లా  జంగారెడ్డిగూడెం ఉప్పల మెట్ట దగ్గర గల ప్రభుత్వ బలయోగి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్ధిని గండి స్వాతీ (17) ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతదేహన్ని   పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే స్వాతిది ఆత్మహత్య కాదని, కళాశాల యాజమాన్యం వేధింపులే కారణం అంటూ బంధువులు ఆందోళ చేపట్టారు. తమ కుమార్తె మృత దేహాన్ని చూపించడం లేదంటూ పోలీసులపై విద్యార్థిని తల్లి దండ్రులు బంధువులు మండిపడ్డారు.  మార్చురీ తలుపులను బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. ఈ సందర్బంగా  పోలీసులకు, బంధువులకు మధ్య తోపులాట జరిగింది..కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని, జిల్లా ఎస్పీ వచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని  ఆస్పత్రి ఎదుట బంధువులు బైఠాయించి ఆందోళన చేసారు. 

Related Posts