YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ

పొంగల్‌ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై దంపతులు

పొంగల్‌ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై దంపతులు

పొంగల్‌ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై దంపతులు
చెన్నై జనవరి 14  
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సంక్రాంతి పండుగను చెన్నైలో జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. తమిళనాడు - తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటాను అని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమిళనాడులోని ప్రాచీన ఆలయాల శిల్పసౌందర్యాన్ని వీక్షించాలనే ఆతృత కనబరుస్తారని చెప్పారు. తమిళనాడు ఆలయాలను సందర్శించి దేవుడిని ప్రార్థించి.. ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆహ్వానిస్తున్నాని గవర్నర్‌ పేర్కొన్నారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహాకానికి ఇరు రాష్ర్టాల మధ్య వారధిలా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. జల బంధం.. తదితర అంశాలపై తనకు అనేక ఆలోచనలు ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు.

Related Posts