YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 వెంకన్న సన్నిధిలో విఐపీలు

 వెంకన్న సన్నిధిలో విఐపీలు

 వెంకన్న సన్నిధిలో విఐపీలు
తిరుమల జనవరి 18, 
తిరుమల శ్రీవారిని శనివారం  పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి భార్య సురేఖ ఈ ఉదయం తిరుమల చేరుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె స్వామి సేవలో పాల్గొన్నారు. అదే సమయంలో మరో నటుడు సుమన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనానంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నట్టు తెలిపారు.స్వామి, తల్లితండ్రుల ఆశీర్వదాంతో 9 భాషల్లో కలిపి 500 సినిమాల్లో నటించాను అందులో 100 సినిమాలు హీరోగా నటించినట్లు చెప్పారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జరిగిన వివాదంపై స్పందించిన సుమన్ .. గొడవలు చాలా చిన్న విషయం, వాటిని ఇంతలా ఎక్సేపోజ్ చెయ్యడం బాధాకరమని అన్నారు.చిరంజీవి చెప్పనట్లు ఎదైనా ఉంటే చర్చించుకోవాలని అన్నారు.

Related Posts