YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

 సమ్మక్క జాతర ఏర్పాట్లు వేగవంతం

 సమ్మక్క జాతర ఏర్పాట్లు వేగవంతం

 సమ్మక్క జాతర ఏర్పాట్లు వేగవంతం
హైదరాబాద్  జనవరి 18
వచ్చే ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.    ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా , డిజిపి మహేందర్ రెడ్డి, అదనపు డిజిపి జితెందర్ , ఐజి నాగిరెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు , ఎస్.పి. పాటిల్ , ఐ.టి.డి.ఎ. పి.ఓ. చక్రదర్ రావు  ఆర్.డబ్లుఎస్ , ఆర్ అండ్ బి  పంచాయతీ రాజ్ ఇ.ఎన్.సి లు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి , పంచాయతీ రాజ్ ద్వారా నిర్మించే రోడ్ల, కల్వర్టుల నిర్మాణాని జనవరి 25 వరకు పూర్తి చేయాలని , ఇతర రోడ్లు ప్యాచ్ వర్కు లను వెంటనే పూర్తి చేయాలని సి.యస్. ఆదేశించారు. రోడ్ల వెంట మూడు భాషలతో సైన్ బోర్డుల ఏర్పాటు ను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కింగ్ లాట్ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి సక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసే లా చూడలన్నారు. శానిటేషన్ కు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వలాన్నారు. జిల్లా యంత్రాంగం అక్కడ నే ఉండే పనులను సమన్వయం తో పూర్తి చేయలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను సక్రమ పద్దతిలో ఏరాపాటు చేసి ప్రజలకు ఏప్పటి కప్పుడు సమాచారం అందించాల్నారు. టాయిలెట్లు, ట్యాప్ ల ఏర్పాటు ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ , ఎస్.పి. స్పెషల్ ఆఫీసర్, ఐ.టి.డి.ఎ పి.ఓ. సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. గద్దెలకు వెళ్ళె దారులలో షాపుల వద్ద రద్దీ ఏర్పడ కుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యారికెడింగ్ ఏర్పాటు చేసి రద్దీ లేకుండా క్రమబద్దికరించాలన్నారు. త్వరలోనే పనుల పరీశిలనకు పర్యటించనున్నట్లు తెలిపారు. డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యనప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక్క చోట పి.ఎ.సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్రౌడ్ మేనేజిమెంట్ పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
 

Related Posts