YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి సినిమా ఆంధ్ర ప్రదేశ్

తన ఇల్లును వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం

తన ఇల్లును వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం

తన ఇల్లును వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం
నెల్లూరు ఫిబ్రవరి 12 
విశ్వవిఖ్యాత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తన ఉదారత్వాన్ని చాటుకుని పదుగురికి ఆదర్శంగా నిలిచారు. తరతరాలుగా తనకు సంప్రాప్తించిన ఆస్తిని ఆ మధుర గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. నెల్లూరు లోని తిప్పరాజువారి వీధిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు తాతలతండ్రుల నుంచి వచ్చిన ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆయన ఆ ఇంటిని కంచి కామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటిలో కంచి పీఠం వారి వేద పాఠశాల త్వరలో ఏర్పాటు కాబోతున్నది. ఆయన మధుర గాయకుడే కాదు. మనుసున్న మా రాజు అని నిరూపించుకున్నారు.

Related Posts