YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్

రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్

 రథానికి నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్
విచారణకు ఆదేశం
భక్తులెవరూ ఆందోళన చెందవద్దు..
విజయవాడ ఫిబ్రవరి 14,
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.  విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. అలానే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.  ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇటువంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.   దేవాలయాల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

Related Posts