YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పదమూడు మంది ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

పదమూడు మంది ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

పదమూడు మంది ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు
చిత్తూరు ఫిబ్రవరి 14,
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల ఆటవీ ప్రాంతంలో   కోటిన్నర  విలువచేసే  ఎర్రచందనం పట్టుపడింది. పదమూడు మంది  స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం శేషాచల అడవులలో టాస్క్ ఫోర్స్ పోలీసులు  కుంబింగ్ నిర్వహించారు.  శ్రీనివాస మంగాపురంలోని రైల్వే ట్రాక్ వద్ద తనిఖీలు చేస్తుండగా భారీగా ఎర్రచందనం దుంగలను  గుర్తించారు.  52 ఎర్ర చందనం దుంగలతో పాటు 13 మంది స్మగ్లర్లు అరెస్టు చేసారు. వీటి విలువ 1.50 లక్షల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.నిందితుల్లో  ఇద్దరు స్థానికులు వున్నారు.   లోడింగ్ చేస్తున్న ఒక టెంపో ట్రావెలర్, ఒక కారు  స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ పి రవిశంకర్ ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వాసు విజయ్ ఆర్ ఎస్ ఐ లు ఎఫ్ డి ఓ జానీ డిఆర్ఓ  బృందంతో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు

Related Posts