YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

 నెంబర్ వన్ ర్యాంకింగ్ లో రాహుల్

 నెంబర్ వన్ ర్యాంకింగ్ లో రాహుల్

 నెంబర్ వన్ ర్యాంకింగ్ లో రాహుల్
ముంబై, ఫిబ్రవరి 17
న్యూజిలాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో పరుగుల వరద పారించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంక్‌కి చేరువయ్యాడు. సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 823 పాయింట్లతో రాహుల్ రెండో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 897 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 673 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమయ్యాడు.కివీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో ఏకంగా 224 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. సిరీస్‌ని భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్‌లో 4 మ్యాచ్‌లాడినా.. 105 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో.. పదో స్థానానికి కోహ్లీ పడిపోయాడు. భారత్ తరఫున టాప్-10లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే నిలవగా.. ఓపెనర్ రోహిత్ శర్మ 662 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టాడు.టీ20 బౌలింగ్, ఆల్‌‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కనీసం ఒక్క భారత క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 630 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 567 పాయింట్లతో 20వ ర్యాంక్‌తో సరిపెట్టాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో కూడా టీమిండియా క్రికెటర్‌కి చోటు  లభించలేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ గత ఏడాది నుంచి నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. వన్డేల్లో రోహిత్ వర్మ నెం.2లో కొనసాగుతున్నాడు. ఇక టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు 4వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ గత ఏడాది నుంచి నెం.1 స్థానంలో ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.

Related Posts