YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

 అమెరికా, భారత్ బిగ్ డీల్

 అమెరికా, భారత్ బిగ్ డీల్

 అమెరికా, భారత్ బిగ్ డీల్
న్యూయార్క్, ఫిబ్రవరి 25  
రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై కలసి పోరాడాలని నిర్ణయించామన్నారు. సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. ఇస్లాం తీవ్రవాదాన్ని అణిచి వేస్తామని చెప్పారు. టూర్ తాను ఎప్పటికీ మరచి పోలేనని చెప్పారు. ఇండియాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. భారత్ తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ట్రంప్ తెలిపారు. మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు.  5జి నెట్ వర్క్ పై కూడా చర్చించామన్నారు.  తాను అధ్యక్షుడిని అయ్యాక భారత్ తో ఆర్థిక సంబంధాలు మరింత పెరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. తిరిగి సాయంత్రం 5గంటలకు మరోసారి మీడియాతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం ట్రంప్, మోడీలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యకత్ం చేశారు. దైత్య సంబంధాల్లో రక్షణ సహకరాం కీలకమైందన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాలపై ఇరువురం చర్చించామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించామని చెప్పారు. శాస్త్ర , సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని మోడీ తెలిపారు. ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతాయని చెప్పారు. ట్రంప్ తో తనకు ఎనిమిదో సమావేశామని మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయన్నారు. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చబోతున్నామని మోడీ తెలిపారు. భారత్ – అమెరికా సంబంధాలకు ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు.మూడు కీలక ఒప్పందాలు జరిగాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణ సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. భారత పర్యటనకు వచ్చినందుకు డొనాల్డ్ ట్రంప్‌కి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. మొతేరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తాను మోదీ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రజలు మరింతగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారన్నారగడిచిన 8 నెలల్లో ఐదుసార్లు ట్రంప్‌తో  సమావేశమయ్యానని ప్రధాని మోదీ తెలిపారు. ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామన్నారు. సమాన అవకాశాలతో కూడిన స్వేచ్ఛా వాణిజ్యం దిశగా చర్చలు జరిపామన్నారు. దౌత్య సంబంధాల్లో రక్షణ సహకారం కీలకమైందన్నారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాడతామన్నారు. భారత్, అమెరికా సంబంధాలకు ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాల అందబోతున్నాయన్నారు. భారత్-అమెరికా స్నేహబంధం 21వ శతాబ్దానికి ఎంతో ముఖ్యమన్నారు.భారత్‌లో తమకు అద్భుతమైన స్వాగతం లభించిందని  ట్రంప్.. మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని, రాజ్‌ఘాట్‌ను, తాజ్‌మహాల్ను సందర్శించడం ఆనందాన్ని ఇచ్చాయన్నారు. తన పర్యటన పలఫ్రదమైందని, ఈ టూర్ ఎంతో ప్రత్యేకమన్నారు. అపాచీ, ఎం-16 హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు. 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరిందన్నారు. తాను అధ్యక్షుడయ్యాక భారత్‌తో ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయన్నారు.

Related Posts