YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే

మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే

మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే
ముంబై, ఫిబ్రవరి 28  
కరోనా వైరస్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రాణాంతక వైరస్ అత్యంత వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను కుదిపేశాయి. దాదాపు 50 దేశాలకు వైరస్ పాకడం ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచింది. దీంతో, మదుపుదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా పతనమయ్యాయి. అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,448 పాయింట్లు నష్టపోయి 38,297కి పడిపోయింది. నిఫ్టీ 431 పాయింట్లు కోల్పోయి 11,201కి దిగజారింది.  అమెరికా, యూరోప్ దేశాల త‌ర‌హాలో ఆసియా మార్కెట్లు కూడా ప‌త‌న‌మ‌వుతున్నాయి.  ఆస్ట్రేలియా షేర్ మార్కెట్ ఇవాళ 3.3 శాతం ప‌డిపోయింది. ఆ దేశానికి చెందిన ఏఎస్ఎక్స్‌200 మార్కెట్ కూడా ప‌ది శాతం ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది.  2008 త‌ర్వాత ఆస్ట్రేలియాలో మార్కెట్లు ప‌డిపోవ‌డం ఇదే మొద‌టిసారి.  జ‌పాన్‌కు చెందిన నిక్కీ ఇండెక్స్ కూడా డౌన్ అయ్యింది.  నిక్కీ షేర్లు మూడు శాతం ప‌డిపోయాయి.  అమెరికాలో గురువారం డౌ జోన్స్ అత్య‌ధిక స్థాయిలో ప‌త‌న‌మైంది. అయితే అమెరికా మార్కెట్ ప్ర‌భావం వ‌ల్ల జ‌పాన్ మార్కెట్లు కూడా నిర్వీర్యం అవుతున్నాయి.   మ‌రోవైపు క‌రోనా కేసులు కొత్త‌గా ప‌లు దేశాల్లో న‌మోదు అయ్యాయి.  స‌బ్ స‌హారా ఆఫ్రికా దేశ‌మైన లాగోస్‌, నైజీరియాల్లో కూడా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి.  న్యూజిలాండ్‌లో కూడా తొలి కేసు న‌మోదు అయ్యింది.  ఇరాన్ నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లు తేల్చారు.  యూరోప్‌లోని బెలార‌స్‌, నెద‌ర్లాండ్స్‌, లిథువేనియా కూడా తొలి కేసు నమోదు అయిన‌ట్లు పేర్కొన్నాయి. ద‌క్షిణ‌కొరియాలో క‌రోనా కేసులు 256కు చేరుకున్నాయి.  నార్త్ కొరియాకు వైద్య ప‌రిక‌రాలు పంపేందుకు డ‌బ్ల్యూహెచ్‌వో కొన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది.  జ‌పాన్‌లో రెండు డిస్నీ థీమ్ పార్క్‌ల‌ను రెండు వారాల పాటు మూసివేశారు.  బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (0.05%) మాత్రమే లాభపడింది. టాప్ లూజర్లలో టెక్ మహీంద్రా (-8.14%), టాటా స్టీల్ (-7.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (-7.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-6.25%), బజాజ్ ఫైనాన్స్ (-6.24%) ఉన్నాయి.

Related Posts