YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోన పై మంత్రుల భేటీ

కరోన పై మంత్రుల భేటీ

కరోన పై మంత్రుల భేటీ
హైదరాబాద్ మార్చి 3
రాష్ట్రంలో కరొన వైరస్ గుర్తించిన నేపథ్యంలో   మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావుల ఉన్నత స్థాయి సమావేశం  మంగళవారం జరిగింది. మర్రి చెన్నారెడ్డి  మానవ వనరుల కేంద్రం లో జరుగుతున్న ఈ సమావేశానికి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు  వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు అధిపతులు మరియు ఉన్నతాధికారులు  హజరయ్యారు. సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు.  24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటు తో పాటు  ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింత గా పెంచాలి. గతంలో వచ్చిన ఇతర వైరస్ ల తో పోల్చితే కరోనా వైరస్ లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుంది.  ఈ నేపథ్యంలో ప్రజలు  ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని మంత్రులు అభిప్రాయపడ్డారు.  ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని అన్నారు. కరోన  వస్తే చనిపోతారు అన్న ప్రచారం లో  ఏమాత్రం  వాస్తవం లేదు. కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.  ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోన మెడికేషన్  కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయి.  పత్రికలు, టీవీలు,  సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే  పాజిటివ్ ప్రచారం నిర్వహించాలని సూచించారు.  ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.  తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలని అన్నారు.  హైదరాబాద్ తో  పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్ లను  ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు  వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోన వైరస్ పైన అసత్యాలను ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు వెల్లడించారు.

Related Posts