YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

మహేంద్ర హిల్స్ లో కరోనా టెన్షన్

మహేంద్ర హిల్స్ లో కరోనా టెన్షన్

మహేంద్ర హిల్స్ లో కరోనా టెన్షన్
హైద్రాబాద్, మార్చి 5
 ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ పరిసర ప్రాంతాల ప్రజల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోవిడ్ (కరోనా  వైరస్) బాధితుడు మహేంద్రహిల్స్ వాసి కావడంతో అక్కడి ప్రజలతో మాట్లాడడానికి, కలవడానికి చుట్టుపక్కల ప్రజలు జంకుతున్నారు.పాఠశాలలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు స్కూల్ యాజమాన్యాలు. మహేంద్రహిల్స్ లోని సెయింట్ ఆక్జీలియం పాఠశాల , ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ స్కూల్, బచ్ పన్ స్కూల్ విద్యార్థులకు సెలవు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఇళ్ళకే పరిమితమయ్యారు.సాధారణ సమయాలలోనే మహేంద్రహిల్స్ నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా భయంతో కర్ఫ్యూ వాతా వరణాన్నే తలదన్నేలా తయారయ్యింది. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా ఇళ్లకు పరిమితమవ్వడమే కాకుండా, విధులు నిర్వర్తించడానికి మాస్కులు ధరించి బయటికి వస్తున్నారు. అలా బయటికి వచ్చిన వారితో ఇతర సిబ్బంది కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మహేంద్ర హిల్స్ లోనే బీసీ బాలుర వసతి గృహం ఉంది. ఆ వసతి గృహంలో ఉంటూ సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట, మారేడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారిని కూడా మూడు రోజులపాటు పాఠశాలలకు రావద్దని పంపించి వేశారు. వీలైనంత తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి   కరోనా భయం గుప్పిటి నుండి తమను బయటకు పడేయాలని అక్కడి జనం కోరుతున్నారు మహేంద్రహిల్స్ లో కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం వారు పరిశుభ్రత, అవగాహన చర్యలు చేపట్టగా, గురువారం జిహెచ్ఎంసి సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో పరిశుభ్రత చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ బారిన పడిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో గత కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య 88కి చేరింది. సోమవారం రాత్రి నాటికి అలాంటివారిని 80 మందిని గుర్తించిన అధికారులు మంగళవారం మరో 8 మందిని గుర్తించారు. వారందరి వివరాలూ సేకరించారు. వారిలో 45 మంది ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అతడు ప్రయాణించిన బస్సు డ్రైవర్‌, క్లీనర్‌, తోటి ప్రయాణికులు సహా మొత్తం 25 మందిని గుర్తించారు. అలాగే ఆ యువకుడి కుటుంబంలో అతడితో సన్నిహితంగా మెలిగినవారు 13 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో 36 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు. కరోనా భయం  కారణంగా వైరస్ నివారణ మందును జీహెచ్ఎంసీ స్ప్రే చేయించింది. పరిసరాలను పరిశుభ్రం చేశారు. మరోవైపు కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను మహేంద్ర హిల్స్‌లోని వారి ఇంట్లోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ఎవర్నీ ఇంట్లో నుంచి బయటకు రానీయడం లేదు.

Related Posts