YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

కరోనా ప్రభావంతో మార్చి 31 వరకు తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ బంద్

కరోనా ప్రభావంతో మార్చి 31 వరకు తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ బంద్

     
కరోనా ప్రభావంతో మార్చి 31 వరకు తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ బంద్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం  కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో  మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లను ముసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కరోనాపై  సీఎం కేసీఆర్‌ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని..ముందస్తు చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే టెన్త్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు  కొనసాగనున్నాయి. మీటింగ్ నిర్ణయాలను సాయంత్రం కేబినెట్ ముందు సీఎం ఉంచనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత  కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Related Posts