YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

సొంతూరికి కరోనా జ్యోతి

సొంతూరికి కరోనా జ్యోతి

సొంతూరికి కరోనా జ్యోతి
తిరుపతి, మార్చి  14 
కరోనా ఎఫెక్ట్‌తో చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లాకు చెందిన యువతి అన్నెం జ్యోతి సొంత ఊరికి చేరుకోనుంది. గత నెలలోనే ఢిల్లీకి చేరుకున్నా.. ఢిల్లీ చావ్లాలోని ITBP మెడికల్ ఐసోలేషన్ క్యాంపులో 14 రోజుల పాటు ఉంచారు. ఆమెకు కరోనా మెడికల్ పర్యవేక్షణలో ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధారణ అవడంతో డాక్టర్లు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి కర్నూలు జిల్లాలోని సొంత ఊరికి చేరుకోనున్నారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నెం జ్యోతికి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం రావడంతో శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లింది. ఇంతలోనే చైనాలో కరోనా వైరస్ కలకలం మొదలైంది. అప్పటికే వూహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన జ్యోతిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కానీ విమానం ఎక్కే సమయంలో జ్యోతిని పరీక్షించగా.. ఆమె శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉంది. దీంతో కరోనా వైరస్‌ అనుమానిత కేసుగా భావించి ఆమె ప్రయాణాన్ని చైనా అధికారులు అడ్డుకోవడంతో చైనాలోనే చిక్కుకుపోయింది. తనను అక్కడి నుంచి తీసుకురావాలంటూ జ్యోతి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.అంతేకాదు అన్నెం జ్యోతికి ఆమె సమీప బంధువు, మహానంది మండలం తమ్మడపల్లెకి చెందిన అమర్‌నాథ్‌రెడ్డితో వివాహం నిశ్చయమైంది. గతేడాది జూన్‌ 23న వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. చైనా నుంచి ఆమె తిరిగి వచ్చాక వివాహం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14, 15వ తేదీన ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆమె చైనాలో చిక్కుకుపోయింది. వెంటనే ఏపీకి చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల్ని కలిసి ఆమెను వెనక్కు తీసుకోచ్చేలా చూడాలని కోరారు.జ్యోతిని స్వస్థలంకి రప్పించేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేన నేతృత్వంలో OSD పి. రవిశంకర్ తదితరులు భారత్-చైనా విదేశాంగ శాఖలతో చర్చలు జరిపి సురక్షితంగా మనదేశానికి రప్పించడంలో కృషి చేసారు. వారి కృషి కారణంగా జ్యోతి సురక్షితంగా ఆమె స్వగ్రామానికి చేరుకోనుంది.

Related Posts