YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

 డ్రోన్ ద్వారా మెడికిల్ కిట్

 డ్రోన్ ద్వారా మెడికిల్ కిట్

 డ్రోన్ ద్వారా మెడికిల్ కిట్
హైద్రాబాద్, మార్చి 16
మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బ్లడ్‌ బ్యాంకుల్లో మారుట్‌ డ్రోన్స్‌ ఉంటాయి. ఆర్డర్‌ రాగానే ఇక్కడి డ్రోన్స్‌లో సంబంధిత సిబ్బంది మందులను అమర్చితే డ్రోన్లు టేకాఫ్‌ అవుతాయి. 8 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరం డ్రోన్లు ప్రయాణిస్తాయి.డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మందులు, డయాగ్నస్టిక్‌ శాంపిల్స్‌ సేవలను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ మారుట్‌ డ్రోన్స్, అపోలో ఆస్పత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు, రోడ్లు, రవాణా సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తారు. వర్షా కాలంలో, రాత్రి సమయాల్లో ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్లటం కష్టం కాబట్టి ఇక్కడి ప్రజలకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణిలు, పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర రోగులకు మందులను సరఫరా చేస్తారు. ఈ డ్రోన్ల ద్వారా రక్తం, వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్‌ శాంపిల్స్, దీర్ఘకాలిక ఔషధాలను సరఫరా చేస్తారు. మెడికల్‌ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపోలో ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది.ఇవి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అనుసంధానిత డ్రోన్స్‌. దీన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రణ చేస్తారు. ఓలా, ఉబర్‌లు ఎలాగైతే గమ్య స్థానాన్ని మ్యాప్‌లో చూపిస్తాయో అలాగే ఈ డ్రోన్స్‌ మ్యాప్స్‌ ఆధారంగా గమ్య స్థానానికి చేరుకుంటుంది. అంతేకాదు మందులను బుక్‌ చేయగానే వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తేనే మందు లు డెలివరీ అవుతాయి. దీంతో సరైన మనిషికే మందులు అందుతాయన్న మాట. డ్రోన్‌ ఎంత దూరంలో ఉంది? ఎంత సమయం పడుతుంది? వంటి సమాచారం లైవ్‌లో కనిపిస్తుంటుంది. దీంతో రోగికి ఒత్తిడి తగ్గుతుంది. ‘మెడికల్‌ డ్రోన్స్‌ సాంకేతికత మీద ఏడాది కాలంగా పని చేస్తున్నాం. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు’ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.గతంలో మారుట్‌ డ్రోన్స్‌ జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యంతో మియాపూర్, రాయదుర్గంలోని చెరువుల్లో దోమ మందులను పిచికారి చేసింది. సిరిసిల్ల జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల సహాయంతో సీడ్‌ బాల్స్‌లను నాటింది. మస్కిటో డ్రోన్స్‌లోని ఏఐ సాంకేతికత పిచికారితో పాటు దోమల సంఖ్య, లార్వా లెక్కింపు, దోమల జాతి, లింగ బేధాలు వంటి రియల్‌ టైం నివేదికలను కూడా అందిస్తుంది. గంటకు 6 ఎకరాలకు పిచికారి చేస్తుంది. ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతంలో 52 కిలోమీటర్లు, తెలంగాణలోని 70 చెరువుల్లో యాంటి లార్వా అరాడికేషన్‌ను ప్రాజెక్టులను చేపట్టామని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Related Posts