YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం జ్ఞానమార్గం తెలంగాణ

 రాములోరి పెళ్ళికి ఎవరూ రాకండి -  మంత్రి అజయ్

 రాములోరి పెళ్ళికి ఎవరూ రాకండి -  మంత్రి అజయ్

 రాములోరి పెళ్ళికి ఎవరూ రాకండి -  మంత్రి అజయ్
ఖమ్మం మార్చ్ 17
భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు దక్కదు. కారణం కరోనా మహమ్మారి. ఇది రాష్ట్రంలో రోజు రోజుకూ ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి తెలిపారు.
ఆలయ అర్చకులు మాత్రమే శాస్ర్తోక్తంగా కల్యాణ క్రతువును ఈసారి నిర్వహిస్తారు కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి వెల్లడించారు.

Related Posts