YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కుమార్తెలను ఎందుకు పిలిపించారు

కుమార్తెలను ఎందుకు పిలిపించారు

కుమార్తెలను ఎందుకు పిలిపించారు
విజయవాడ, మార్చి 18
ముఖ్యమంత్రి జగన్‌ మెహన్ రెడ్డి  తన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారని టీడీపీ నేత  బుద్ధా వెంకన్నప్రశ్నించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.  'పారాసిటిమల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందని వైఎస్ జగన్‌ సెలవిచ్చారు.  అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్,  ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారని ప్రశ్నించారు. 'అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా ఫర్వాలేదు.  జగన్ కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్థమా  అని అయన  నిలదీశారు.

Related Posts