YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ విదేశీయం

కరీంనగర్‌లో కలకలం.. ఇండోనోషియా బృందంపై నిఘా

కరీంనగర్‌లో కలకలం.. ఇండోనోషియా బృందంపై నిఘా

కరీంనగర్‌లో కలకలం..
ఇండోనోషియా బృందంపై నిఘా
కరీంనగర్ మార్చి 19   
ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన బృందంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇండోనోషియా బృందం జిల్లాకు వచ్చినట్లు తెలుసుకున్న కరీంనగర్ వాసులు భయంతో వణికిపోతున్నారు!. అసలు ఇండోనేషియా బృందం కరీంనగర్‌కు ఎందుకు వచ్చింది?.. వారికి ఎవరితో సంబంధాలున్నాయి.. ఆ బృందం ఎక్కడ పర్యటించింది?.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థతో వారికి ఉన్న సంబంధాలు ఏమిటి? అనే విషయాలపై నిఘా వర్గాల ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యాయి.దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలను ఇండోనేషియా బృందాలే ఆర్గనైజ్‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి కరోనా ఉన్న నేపథ్యంలో పోలీసులు, నిఘా వర్గాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో  అధికారులంతా అప్రమత్తమయ్యారు. గురువారం నాడు  కరీంనగర్లో జనసంచారం కనుమరుగయి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు.

Related Posts