YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 పాకిస్తాన్ లో తీవ్రంగా కరోనా

 పాకిస్తాన్ లో తీవ్రంగా కరోనా

 పాకిస్తాన్ లో తీవ్రంగా కరోనా
లాహోర్, మార్చి 20
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ముప్పు పాకిస్థాన్‌ను మరింతగా కలవరానికి గురి చేస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాన్‌ పొరుగునే ఉండటం.. పాక్ షియా ముస్లింలు భారీ సంఖ్యలో ఇరాన్ వెళ్లి రావడంతో.. పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన వారిని సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ పట్టణం తఫ్తాన్‌లో పాకిస్థాన్ క్వారంటైన్‌లో ఉంచింది. వేలాది మందిని ఉంచిన ఈ సెంటర్లో కనీస వసతులేవీ లేవని అక్కడ నిర్బంధంలో ఉన్నవారు చెబుతున్నారు. ఇక్కడ కేవలం టెంట్లు మాత్రమే వేశారని బాత్రూమ్‌లు లేవని, టవల్స్, దుప్పట్లు లాంటివేవీ ఇక్కడ అందుబాటులో లేవని సమాచారం. ఇది జైలుకు ఏమాత్రం తీసిపోదని.. ఇంతటి దరిద్రమైన ప్రదేశంలో ఎప్పుడూ జీవించలేదని మహ్మద్ బకీర్ అనే వ్యక్తి వాపోయాడు. జంతువుల్లా చికిత్స అందిస్తున్నారని ఆయన తెలిపాడు.ఈ క్యాంపులో వేలాది మందిని ఉన్నప్పటికీ.. వారిలో కరోనా లక్షణాలు బహిర్గతమైనప్పటికీ.. పరీక్షలు నిర్వహింలేదని, కనీసం ఐసోలేషన్‌లో కూడా ఉంచలేదని చికిత్స అందిస్తోన్న డాక్టర్లే చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. గత మూడు వారాలుగా ఇక్కడ కరోనా పరీక్షలు చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవని డాక్టర్ ఒకరు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్లో ఉన్న వారికి డయాబెటిస్, హెపటైటిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి మందులు అందించడం లేదన్నారు. ఓ చిన్నారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే.. క్వెట్టాలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. 14 రోజుల తర్వాత ప్రజలను వారి స్వస్థలాలక పంపిస్తున్నారు.ఈ క్యాంపులో వేలాది మందిని ఉన్నప్పటికీ.. వారిలో కరోనా లక్షణాలు బహిర్గతమైనప్పటికీ.. పరీక్షలు నిర్వహించడం లేదని, కనీసం ఐసోలేషన్‌లో కూడా ఉంచలేదని చికిత్స అందిస్తోన్న డాక్టర్లే చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. గత మూడు వారాలుగా ఇక్కడ కరోనా పరీక్షలు చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవని డాక్టర్ ఒకరు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్లో ఉన్న వారికి డయాబెటిస్, హెపటైటిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి మందులు అందించడం లేదన్నారు. ఓ చిన్నారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే.. క్వెట్టాలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. 14 రోజుల తర్వాత ప్రజలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారుపేరుకే ఇది క్వారంటైన్ సెంటర్ అనీ.. ఇక్కడ హ్యాండ్ వాష్‌లు, ఫేస్ మాస్కుల్లాంటి సదుపాయాలు కూడా లేవని 14 రోజులుపాటు ఇక్కడున్న వారు చెబుతున్నారు. ఈ క్యాంపు నుంచి చాలా మంది స్వేచ్ఛగా పట్టణంలోకి వెళ్లి.. తమకు కావాల్సినవి కొనుగోలు చేస్తున్నారని, జనసమ్మర్థంలో తిరుగుతున్నారని అబిద్ హుస్సేన్ అనే వ్యక్తి తెలిపారు. వ్యాధులను కట్టడి చేయడంలో పాకిస్థాన్ పనితీరు పేలవం. పోలియాను నిర్మూలించలేకపోయిన రెండు దేశాల్లో పాక్ ఒకటి. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌లో వైద్య వసతులు చాలా తక్కువ. కరోనాకు చికిత్స అందించే స్థోమత తమకు లేదని పాక్ ఎప్పుడో ప్రకటించింది. వుహాన్‌లో చిక్కుకున్న 600 పాక్ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కూడా దాయాది దేశం సుముఖత వ్యక్తం చేయలేదుమార్చి 20 నాటికి పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 454కు చేరింది. బలూచిస్థాన్, పంజాబ్, సింధు, గిల్గిట్ బల్టిస్థాన్, ఖైబర్-పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లలో కరోనా కేసులు పెరిగాయి. గురువారం బలూచిస్థాన్ కొత్తగా 60 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ ప్రావిన్స్ సీఎం జామ్ కమల్ ఖాన్ తెలిపారు. బలూచిస్థాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76కు చేరింది. కాగా బలూచిస్థాన్‌లో 81 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చెప్పారని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో బలూచిస్థాన్ ప్రభుత్వం ప్రజా రవాణాపై నిషేధం విధించింది. ప్రావిన్స్‌లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.సింధు ప్రావిన్స్‌లో దారుణమరోవైపు పంజాబ్ ప్రావిన్స్‌లో 78 కేసులు నమోదు కాగా లాహోర్‌లోనే 14 కేసులు నమోదయ్యాయి. సింధు ప్రావిన్స్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. పాక్‌లో నమోదైన కేసుల్లో సగానికి పైగా సింధు ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ 245 కరోనా కేసులు నమోదు కాగా.. కరాచీ నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 93కి చేరింది. ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో కరోనా కారణంగా గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా కరోనా కారణంగా మరో ఇద్దరు కూడా చనిపోయారని తెలుస్తోంది. వీరిద్దరికీ చాలా ఏళ్లుగా డయాబెటిస్ ఉంది.

Related Posts