YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

18కు చేరిన కరోనా కేసులు

18కు చేరిన కరోనా కేసులు

18కు చేరిన కరోనా కేసులు
హైద్రాబాద్, మార్చి 20
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం (మార్చి 20) మధ్యామ్నం ధ్రువీకరించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ ఇద్దరు వ్యక్తులు కూడా విదేశాల నుంచే వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా.. కరోనా అనుమానిత లక్షణాలు ఉండగా వారిని నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. నమూనాలను పరీక్షలకు పంపించగా.. శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బాధితులిద్దరూ లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.అయితే.. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఏ ఒక్కరికీ సీరియస్‌గా లేదని.. బాధితులందరూ కోలుకుంటున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.అటు.. దేశంలో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇటలీ పర్యాటకుడు శుక్రవారం మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి మొదటి వారంలో భారత్‌కు వచ్చిన ఇటలీ దంపతులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం మృతుడి భార్య కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 200లకు చేరువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts