YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

లాక్ డౌన్ లో 12 రాష్ట్రాలు

  లాక్ డౌన్ లో 12 రాష్ట్రాలు

లాక్ డౌన్ లో 12 రాష్ట్రాలు

న్యూఢిల్లీ, మార్చి 23 కరోనా వైరస్‌పై పోరాటానికి భారత పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం రైళ్ల రాకపోకలను రద్దు చేసిన కేంద్రం.. మార్చి 31 వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలను లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేబినెట్ సెక్రటరీ, ప్రధాని దగ్గర పని చేసే ప్రిన్సిపల్ సెక్రటరీలు.. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించాక కరోనా ప్రభావిత జిల్లాలను లాక్‌డౌన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే మరిన్ని జిల్లాలను లాక్‌డౌన్ చేయొచ్చని కేంద్రం తెలిపింది.దీంతో ఆదివారం సాయంత్రానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు మహారాష్ట్రలో 144 సెక్షన్ విధించారు. అందరి కన్నా ముందే రాజస్థాన్ లాక్‌డౌన్ ప్రకటించగా.. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్‌లో 20 జిల్లాలను, యూపీలో 15 జిల్లాలను లాక్‌డౌన్ చేశారు. బెంగాల్‌లోనూ కోల్‌కతా సహా చాలా జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. తమిళనాడు సరిహద్దులను మూసివేసింది. బిహార్‌లోని 38 జిల్లా కేంద్రాలను లాక్‌డౌన్ చేయగా.. కర్ణాటకలో 9 జిల్లాలు, ఒడిశాలో ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు.ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంలలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు. కానీ ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. కానీ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రెండో రాష్ట్రమైన కేరళ మాత్రం పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించలేదు. కాసర్‌‌గోడ్ జిల్లాను మాత్రమే షట్‌డౌన్ చేసిన కేరళ.. మిగతా జిల్లాల్లో ఆంక్షలు విధించింది.అంతకు ముందు రైళ్లను రద్దు చేయడం, కేసీఆర్ ప్రకటనతోనే లాక్‌డౌన్ చేసే అవకాశం ఉందని భావించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా.. ప్రయాణికులను చేరవేసే రైళ్లు, మెట్రో, ఎంఎంటీఎస్, లోకల్ రైళ్ల సేవలు నిలిచిపోయాయి, ఆర్టీసీ, ప్రయివేట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల సేవలు కూడా చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయాయి. కేవలం హాస్పిటళ్లు, బ్యాంకులు, మెడికల్ షాపులు, పాలు, కూరగాయలు, సరుకులు విక్రయించే దుకాణాలు తదితర అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి.కేంద్రం అధికారికంగా లాక్‌డౌన్ ప్రకటించకపోయినప్పటికీ.. భారతదేశంలోని మెజార్టీ భాగం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. మార్చి 31 వరకు దాదాపుగా దేశమంతటా ఇదే పరిస్థితి ఉండనుంది. ఈలోగా కరోనా కేసుల సంఖ్య అదుపులోకి రావాలని ఆశిద్దాం. లేదంటే మరి కొద్ది రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు

Related Posts