YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

జనాలు బయటకు....నియంత్రణా చర్యలు గాలికి

జనాలు బయటకు....నియంత్రణా చర్యలు గాలికి

జనాలు బయటకు....నియంత్రణా చర్యలు గాలికి
హైదరాబాద్ మార్చి 23
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. హైదరాబాద్ లో సామవారం ఉదయం నుంచి  ఆటోలు, ప్రైవేటు వాహనాలు యదేచ్చగా తిరుగుతున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజు మాత్రం ప్రజలు స్వీయ నిర్బంధాన్ని ఖచ్చితంగా పాటించారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఆగిపోయయి. దాంతొ ప్రైవేటు వాహనాలు   సొమ్ముచేసుకునేందుకు వచ్చాయి. పలుచోట్ల పోలీసులు నియంత్రించినప్పటికీ.. పూర్తి స్తాయిలో మాత్రం అదుపుచేయలేకపోతున్నారు.వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టకు ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరించినా.. పాటించాల్సిన జాగ్రత్తలను గాలికొదిలేశారు. సామాజిక దూరం పాటించాలని ఓవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, షాపింగ్మాల్స్, నిత్యవసర దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుంపులుగా నిలుచుని ఉన్న ఘటనలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల మద్యం దుకాణాలు కూడా తెరిచి.. ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దశలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయితే టోల్ గేట్లు మూసి.. కేవలం అంబులెన్సులను మాత్రమే వదులుతున్నారు. గూడ్స్ వెహికల్స్, నిత్యవసర వస్తువులు, కూరగాయలు ఉల్లిగడ్డ, పాలు పెరుగు ఉన్న వాహనాలను కూడా వదులుతున్నారు. తెలంగాణ నుంచి విజయవాడ వైపు పెద్ద ఎత్తున వెళ్తున్న ప్రైవేటు లారీలు, కార్లను మాత్రం పక్కనే ఉన్న మైదానంలో టోల్ సిబ్బంది పార్క్ చేయిస్తున్నారు.

Related Posts