YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 సోషల్ డిస్టెన్స్ పాటించండి

 సోషల్ డిస్టెన్స్ పాటించండి

 సోషల్ డిస్టెన్స్ పాటించండి
హైద్రాబాద్, మార్చి 23
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలను అనుమతించడం లేదు. అత్యవసరమైన కొన్ని వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ప్రకటించినా జనాలు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు.. సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చేశారు. షాపులు, కూరగాయల మార్కెట్ల ముందు క్యూ కట్టారు. పోలీసులు హెచ్చరిస్తున్నా జనాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జనాల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చాలా మంది ఇప్పటికీ లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించడంలేదని.. 'దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. మీ కుటుంబాన్ని రక్షించండి, సూచనలను ఖచ్చితంగా పాటించండి' అన్నారు. నియమాలు, చట్టాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను అన్నారు.మరో ట్వీట్‌లో.. కరోనా వైరస్‌‌పై యుద్ధం చేసేందుకు మనం సామాజిక దూరం పాటించాలి.. సీనియర్ డాక్టర్ గురవారెడ్డి ఏం చెప్పారో చూడండి అంటూ కీలకమైన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు.

Related Posts