YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

 గల్ఫ్ నుంచి వెనక్కి పంపేసిన అధికారులు

 గల్ఫ్ నుంచి వెనక్కి పంపేసిన అధికారులు

 గల్ఫ్ నుంచి వెనక్కి పంపేసిన అధికారులు
మెదక్, మార్చి 23
సంగారెడ్డి జిల్లా తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ఓ ప్రైవేటు బస్సును పోలీసులు నిలిపివేశారు. ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చీరాగ్ పల్లి చెక్‌పోస్టు వద్ద ఈ బస్సును అడ్డుకున్నారు. ఇందులో దాదాపు 36 మంది నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరంతా గల్ఫ్ దేశాల నుంచి ముంబయి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి వీరంతా వస్తుండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా బస్సు నుంచి ఎవ్వరినీ దిగనివ్వలేదు. తెలంగాణ సరిహద్దు నుంచి బస్సును వెనక్కి పంపేశారు.ఆదివారం జనతా కర్ఫ్యూ సమయంలోనూ ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వస్తున్న దాదాపు 35 మందిని ఈ ప్రాంతంలోనే అడ్డుకున్నారు. వీరు కూడా గల్ఫ్ దేశాల నుంచి ముంబయికి చేరుకున్నారు. రైళ్లు రద్దు కావడంతో ముంబయి నుంచి స్వస్థలానికి ప్రైవేటు బస్సులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు, కరోనా వైరస్ ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సరిహద్దులన్నింటినీ మూసివేశారు. ఈ క్రమంలోనే అన్ని రోడ్డు మార్గాల వద్ద పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, బాగా తనిఖీలు చేస్తున్నారు. కేవలం సరకు రవాణా వంటి అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.పట్టణాల్లోనూ రోడ్లపైకి వస్తున్న వాహనదారులను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవర్నీ రోడ్ల మీదకు అనుమతించబోమని సోమవారం డీజీపీ స్పష్టం చేశారు. పెట్రోలు బంకులు, కూరగాయల షాపులు కూడా రాత్రి 7 గంటలకే మూసేస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా.. స్థానిక పోలీస్ స్టేషన్‌ల పరిధుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. రోడ్ల మీద తిరుగుతున్న వారిని తనిఖీ చేస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చెక్ పోస్టుల వద్ద కనిపిస్తే.. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్ ముగిశాక వాహనాలను యజమానులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

Related Posts