YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

 యూపీ, ఎంపీల్లోనే లేని లాక్ డౌన్

 యూపీ, ఎంపీల్లోనే లేని లాక్ డౌన్

 యూపీ, ఎంపీల్లోనే లేని లాక్ డౌన్
న్యూఢిల్లీ, మార్చి 24
కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు భారతావని మొత్తం లాక్‌డౌన్‌ అయ్యింది. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం 30 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. నిత్యవసరాలను చేరవేర్చడం కోసం అంతఃరాష్ట్ర సరిహద్దులను దాటే వారికి ఢిల్లీ పోలీసులు ‘కర్ఫ్యూ పాసులు’ ఇవ్వనున్నారు. సోమవారం సాయంత్రం పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వారిపై ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో 475 కేసులు నమోదయ్యాయి.రాజస్థాన్ ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, చంఢీగడ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు ఆదివారం లాక్‌డౌన్ ప్రకటించాయి. మహారాష్ట్ర 144 సెక్షన్ విధించగా.. లాక్‌డౌన్ చేయడానికి తొలుత అంగీకరించని కేరళ.. ఒకే రోజు 28 కేసులు నమోదు కావడంతో.. పరిస్థితిని అదుపులో ఉంచడానికి లాక్‌డౌన్ విధించింది. సోమవారం హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, అసోం, మణిపూర్ రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో మాత్రమే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించలేదు. కానీ ఈ రాష్ట్రాల్లోనూ 58 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. మిగతా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. 600 జిల్లాల్లో ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Related Posts