YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఖైదీలకు పెరోల్ ఇవ్వండి

ఖైదీలకు పెరోల్ ఇవ్వండి

ఖైదీలకు పెరోల్ ఇవ్వండి
అమరావతి మార్చి 24
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టండి. ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదు. నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక సహాయం అందించాలి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం నిమిత్తం ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నారని వివరించారు. తక్షణమే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని సర్వీస్ ఛార్జీలను నియంత్రించాలి. ఖైదీలను విడుదల చేసేందుకు న్యాయశాఖతో సంప్రదించండి. జైళ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఏ మేరకు ఉంటుందో మనకు తెలియంది కాదు. ఏ మాత్రం అలక్ష్యం ఉన్నా జైళ్లలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. విచారణ ఎదుర్కొంటున్న ముద్దాలను బెయిల్ పైన,  శిక్షపడిన ఖైదీలను పెరోల్ పైన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టండని అయన లేఖలో పేర్కోన్నారు.

Related Posts